ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 29, మంగళవారం నాడు గొల్లపూడిలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘దిశ యాప్’ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే లక్షల మంది దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. కాగా ఈ యాప్ ను రాష్ట్రంలో ప్రతి మహిళా డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వం కార్యచరణ చేపడుతుంది. ఈ క్రమంలో ఈ దిశా యాప్ వినియోగంపై మహిళలు, విద్యార్థినులు, యువతులకు మరింత అవగాహన, చైతన్యం కల్పించేందుకు మంగళవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ హాజరై దిశ యాప్ పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. సీఎం వైఎస్ జగన్ గొల్లపూడి పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ