దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,488 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,79,979 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 113 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,56,938 కి పెరిగింది. దేశంలో యాక్టివ్ కేసులు 1,59,590 (1.44%) కు తగ్గాయి. కొత్తగా మహారాష్ట్ర (8333), కేరళ (3671) మాత్రమే 1,000 కి పైగా కొత్త కేసులను నమోదు చేశాయి. అలాగే గత 24 గంటల్లో గుజరాత్, ఒడిశా, చండీగర్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మణిపూర్, మిజోరం, లక్షద్వీప్, లద్దాఖ్, సిక్కిం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 17 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
దేశంలో కరోనా రికవరీ రేటు 97.14 శాతం, మరణాల రేటు 1.42 శాతం:
అలాగే మరో 12,771 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,07,63,451 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 97.14 శాతం గానూ, మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 16,488 కేసులలో 85.75 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ