తమిళనాడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జూలై 22, బుధవారం నాడు ఒక్కరోజే 5849 కరోనా పాజిటివ్ కేసులు, 74 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,492 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 89,561 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు బుధవారం నాటికీ రాష్ట్రంలో 20,95,757 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు. దేశంలో 20 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (జూలై 22, బుధవారం):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 1,86,492
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,31,583
- యాక్టీవ్ కేసులు – 51,765
- జూలై 22 న నమోదైన కేసులు – 5849
- జూలై 22 న డిశ్చార్జ్ అయినవారు – 4910
- జూలై 22 న నమోదైన మరణాల సంఖ్య – 74
- మొత్తం మరణాల సంఖ్య – 3144
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu