ఆంధ్రప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 1935 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 1919 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 13, విదేశాల నుంచి వచ్చిన వారు ముగ్గురు ఉన్నారు. కొత్తగా నమోదైన 1935 కేసులతో కలిపి జూలై 13, సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 31103 కు చేరింది. గత 24 గంటల్లో 19,247 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన అనంతపూర్ లో ఆరుగురు, కర్నూల్ లో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, విజయనగరంలో ఒకరు, విశాఖపట్నంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 365 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 11, ఉదయం 10 గంటల వరకు) :
రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 31103
కొత్తగా నమోదైన కేసులు : 1935
నమోదైన మరణాలు : 37
డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 16464
యాక్టీవ్ కేసులు : 14274
మొత్తం మరణాల సంఖ్య : 365
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu