దేశంలో ఒకే ఒక్క రోజులో అత్యధిక సంఖ్యలో 28,472 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో అత్యధికంగా కోవిడ్-19 బాధితులు కోలుకుని డిశ్చార్జి అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్-19 నుండి కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 7,53,049 కి చేరింది. అలాగే రికవరీ రేటు 63.13 శాతానికి పెరిగింది. మరోవైపు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ కోలుకుంటున్న బాధితుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. మొత్తం 19 రాష్ట్రాలు/ కేంద్రపాలితప్రాంతాలు జాతీయ సగటు కంటే ఎక్కువగా కరోనా రికవరీ రేటును నమోదు చేస్తున్నాయి.
రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు – రికవరీ రేటు
- ఢిల్లీ – 84.83%
- లడఖ్ – 84.31%
- తెలంగాణ – 78.37%
- హర్యాణా – 76.29%
- అండమాన్ & నికోబార్ దీవులు – 75.00%
- రాజస్థాన్ – 72.50%
- గుజరాత్ – 72.30%
- ఛత్తీస్ గఢ్ – 71.81%
- అస్సాం – 71.05%
- ఒడిశా – 70.96%
- తమిళనాడు – 70.12%
- మణిపూర్ – 69.48%
- చండీగఢ్ – 68.97%
- ఉత్తరాఖండ్ – 67.99%
- పంజాబ్ – 67.86%
- మధ్యప్రదేశ్ – 67.47%
- దాద్రా, నగర్ హవేలీ & డమన్, డయ్యూ – 65.67%
- హిమాచల్ ప్రదేశ్ – 64.72%
- బీహార్ – 63.95%
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu