భారత్ లో కొత్తరకం కరోనా వైరస్ నమోదు, ఆరుగురికి నిర్ధారణ అయినట్టు కేంద్రం ప్రకటన

6 Positive Cases of New Coronavirus Strain Found in India,Coronavirus,Covid-19,New Covid Strain,Mutant Covid Strain,Covid Task Force,Mutant Coronavirus,Mutant Strain Of Coronavirus,Coronavirus,Coronavirus In India,Coronavirus Cases In India,Coronavirus Pandemic,Coronavirus Patients,Covid-19,Covid-19 Cases,Covid-19 Cases In India,Covid-19 In India,Coronavirus Cases,Covid-19 Pandemic,Latest Coronavirus News,Coronavirus News Updates,Latest News On Coronavirus,Coronavirus Latest Updates,India Reports 6 Cases Of New Covid-19 Strain,6 Who Arrived In India Test Positive For UK Mutant Strain,6 UK Returnees Test Positive For New Mutant Virus Strain

యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభణతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా అప్రమత్తమయి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వైరస్ వేరియంట్‌ ఇతర దేశాల్లో కూడా వెలుగుచూస్తోంది. తాజాగా భారత్ లోకి కూడా కొత్త రకం కరోనా ప్రవేశించింది. యూకే నుండి భారత్ కు వచ్చిన ఆరుగురిలో కొత్త కరోనా వైరస్ (కొత్త ‌యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం వెల్లడించింది. బెంగళూరులోని నింహన్స్‌ లో మూడు, హైదరాబాద్ ‌లోని సీసీఎంబీలో రెండు, పూణేలోని ఎన్‌ఐవీలో ఒక కేసు నిర్ధారణ అయినట్లుగా తెలిపారు. ఈ వ్యక్తులందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఒకే గదిలో ఉంచినట్టు తెలిపారు. వారితో కాంటాక్ట్ అయిన వాళ్లంద‌రినీ కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించిన‌ట్లు చెప్పారు. అలాగే వారి సహ ప్రయాణికులు, కుటుంబ పరిచయాలు మరియు ఇతరుల కోసం సమగ్ర కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించబడిందని వెల్లడించారు. ఇతరుల నమూనాలపై కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతుందని కేంద్రం తెలిపింది.

మరోవైపు నవంబర్ 25 నుండి డిసెంబర్ 23 అర్ధరాత్రి వరకు సుమారు 33,000 మంది ప్రయాణికులు యూకే నుండి వివిధ రాష్ట్రాల విమానాశ్రయాలలో దిగారని చెప్పారు. ఈ ప్రయాణీకులందరినీ ఆయా రాష్ట్రాలు/యుటిలు ట్రాక్ చేసి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారని, ఇప్పటివరకు దేశంలో యూకే నుంచి వచ్చిన 114 మందికి పాజిటివ్ గా తేలిందని అన్నారు. ఈ పాజిటివ్ కేసుల శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ 10 ఇన్సాకోగ్ ల్యాబ్‌లకు (ఎన్‌ఐబిఎంజి కోల్‌కతా, ఐఎల్ఎస్ భువనేశ్వర్, ఎన్‌ఐవి పూణే, సిసిఎస్ పూణే, సిసిఎంబి హైదరాబాద్, సిడిఎఫ్‌డి హైదరాబాద్, ఇన్‌స్టెమ్ బెంగళూరు, నింహన్స్‌ బెంగళూరు, ఐజిఐబి ఢిల్లీ, ఎన్‌సిడిసి ఢిల్లీ) పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి పరిశీలనలో ఉందని, మెరుగైన నిఘా, నియంత్రణ, పరీక్షలు మరియు శాంపిల్స్ ను ఇన్సాకోగ్ ల్యాబ్‌లకు పంపించడం కోసం రాష్ట్రాలకు క్రమం తప్పకుండా సలహాలు ఇస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇక కొత్తరకం కరోనా వైరస్ కేసులు ఇప్పటివరకు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్ మరియు సింగపూర్‌ దేశాల్లో నివేదించబడ్డాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + one =