తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 21 నుంచి పాతపద్దతైనా కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) ప్రకారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్స్ కు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు సంబంధించి తదుపరి రిజిస్ట్రేషన్ కోసం ఎల్ఆర్ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్స్ కొనసాగించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అయితే మొదటిసారిగా రిజిస్ట్రేషన్స్ కోసం వచ్చే ఫ్లాట్లుకు సంబంధిత సంస్థల అప్రూవల్ లేదా అధికారిక లేఅవుట్ లో ఉంటేనే రిజిస్టేషన్ చేయబడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఎల్ఆర్ఎస్ నిబంధన వలన పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్స్ కోసం వేచిఉన్న ప్రజలకు ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఊరట కలగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ