దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,270 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 28, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,20,723 కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 31 కరోనా మరణాలు నమోదవడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,21,035కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో 15,859 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.75 శాతం:
దేశంలో ప్రస్తుతం 15,859(0.04%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,567 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,24,83,829 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. అలాగే మార్చి 27, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 78,73,55,354 కు చేరుకుంది. మార్చి 27న 4,32,389 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ