విజయవాడలో మంగళవారం నాడు బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రజలకు చీప్ లిక్కర్ అందించడంపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా సోము వీర్రాజు వ్యాఖ్యలపై పెద్దఎత్తున చర్చ జరుగుతుండగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. “వాహ్…వాట్ ఏ స్కీం, వాట్ ఏ షేమ్…ఏపీ బీజేపీ కొత్త పతనానికి దిగజారింది. చీప్ లిక్కర్ను రూ.50కి సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానమా లేదా నిరాశ “అధికంగా” ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉందా?” అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ముందుగా ప్రజాగ్రహ సభలో సోమువీర్రాజు మాట్లాడుతూ, ఏపీలో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం రాష్ట్రంలో నాణ్యత లేని చీప్ లిక్కర్ అమ్ముతుందని విమర్శించారు. మద్యం తాగే వారి నుంచే డబ్బులు రాబట్టి, మళ్ళీ ఎకౌంట్లలో వేస్తుందన్నారు. నాణ్యమైన లిక్కర్ కోసమైనా బీజేపీని గెలిపించాలన్నారు. రాష్ట్రంలో కోటి మంది మద్యం సేవిస్తున్నారని, కోటిమంది బీజేపీకి ఓట్లు వేయండి, బీజేపీ అధికారంలోకి వస్తే రూ.75 కే చీప్ లిక్కర్ ఇస్తాం, ఇంకా కూడా రెవెన్యూ బాగుంటే రూ.50 లకే ఇస్తామని సోము వీర్రాజు అన్నారు.
Wah…what a scheme! What a shame 😝 AP BJP stoops to a new low
National policy of BJP to supply cheap liquor at ₹50 or is this bumper offer only for states where the desperation is “high”? https://t.co/SOBiRq5gNu
— KTR (@KTRTRS) December 29, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ