పూణేలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పూణే నగరంలోని మంజ్రీ ప్రాంతంలో ఉన్న సీరం ఇనిస్టిట్యూట్ ప్లాంట్ లో టెర్మినల్ 1 గేట్ సమీపంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే మంటలను ఆర్పేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి. అలాగే పోలీసులు, స్థానిక అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనికా సౌజన్యంతో “కోవిషిల్డ్” పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిన అనంతరం దేశవ్యాప్తంగా ఇటీవలే కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ