హిమాచల్ ప్రదేశ్‌ లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ “తిరంగ యాత్ర”

AAP Chief Arvind Kejriwal Punjab CM Bhagwant Mann held Tiranga Yatra in Kullu Himachal Pradesh, Punjab CM Bhagwant Mann held Tiranga Yatra in Kullu Himachal Pradesh, AAP Chief Arvind Kejriwal held Tiranga Yatra in Kullu Himachal Pradesh, Tiranga Yatra in Kullu Himachal Pradesh, Kullu Himachal Pradesh, Himachal Pradesh, Tiranga Yatra, AAP Chief Arvind Kejriwal, Arvind Kejriwal, AAP Chief, Punjab CM Bhagwant Mann, Bhagwant Mann, Punjab CM, Tiranga Yatra News, Tiranga Yatra Latest News, Tiranga Yatra Latest Updates, Tiranga Yatra Live Updates, Mango News, Mango News Telugu,

ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తాజాగా హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించి, అక్కడ వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్‌ లోని కులులో తిరంగ యాత్రను నిర్వహిస్తున్నారు. కులు కాలేజ్ గేట్ నుండి ధాల్పూర్ వరకు తిరంగా యాత్ర జరగనుంది. ఈ యాత్రలో హిమాచల్ ప్రదేశ్ ఆప్ అధ్యక్షుడు సూర్జిత్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.

విద్య, వైద్యం, విద్యుత్‌ సహా పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ ఢిల్లీ తరహాలో సమూల మార్పుల తెస్తామని, తమకు అవకాశం ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ హిమాచల్ ప్రదేశ్ ప్రజలను కోరుతున్నారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ గత 35 ఏళ్లలో ఏ పార్టీ కూడా రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టలేదు, దీంతో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పైచేయి సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =