దేశంలో ఇటీవల కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 72,049 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం 82,203 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు కొత్తగా నమోదయిన కేసులలో దేశంలోని కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుండే 78 శాతం నమోదయ్యాయి.
కొత్త కేసుల్లో 78 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 12258
- కర్ణాటక – 9993
- కేరళ – 7871
- ఆంధప్రదేశ్ – 5795
- తమిళనాడు – 5017
- ఉత్తరప్రదేశ్ – 3500
- వెస్ట్ బెంగాల్ – 3370
- ఛత్తీస్ గడ్ – 2888
- ఢిల్లీ – 2676
- ఒడిశా – 2673
మరోవైపు గత 24 గంటల్లో 986 మరణాలు నమోదవగా దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 83 శాతం నమోదయ్యాయి.
986 మరణాల్లో 83 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 370
- కర్ణాటక – 91
- తమిళనాడు – 71
- వెస్ట్ బెంగాల్ – 63
- ఉత్తరప్రదేశ్ – 61
- ఢిల్లీ – 39
- పంజాబ్ – 38
- ఆంధప్రదేశ్ – 33
- కేరళ – 25
- మధ్యప్రదేశ్ – 25
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu