ఏప్రిల్ 10 వ తేదీ నుంచి భారత ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ఖాతాలను వైట్హౌజ్ ట్విట్టర్ ఖాతా నుంచి ఫాలో చేసిన సంగతి తెలిసిందే. దీంతో వైట్హౌజ్ అనుసరిస్తున్న ప్రపంచ నాయకులుగా ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాత్రమే నిలిచారు. అయితే తాజాగా ఈ ట్విట్టర్ ఖాతాలను వైట్హౌజ్ అన్ఫాలో(అనుసరించడం లేదు) చేసింది. అలాగే వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని మరియు న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీని కూడా వైట్హౌజ్ అన్ఫాలో చేసింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. మరో వైపు అమెరికా అధ్యక్షుడి నివాసభవనం వైట్హౌజ్ ట్విట్టర్ ఖాతాను ప్రస్తుతం 20 మిలియన్ల మందికి పైగా అనుసరిస్తుండగా, వైట్హౌజ్ ఖాతా నుండి 13 మందిని ఫాలో అవుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]