భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత వారం రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 9,985 కరోనా పాజిటివ్ కేసులు, 279 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూన్ 10, బుధవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,76,583 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు కొత్తగా నమోదైన 279 మరణాలతో కలిపి కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 7,745 కి చేరింది. మొత్తం కరోనా బాధితుల్లో 1,35,206 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 1,33,632 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజుల్లోనే దేశంలో 69 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 1900 కు పైగా మరణాలు నమోదవడంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 5 వ స్థానంలో, కరోనా మరణాల్లో 12 వ స్థానంలో కొనసాగుతుంది.
#CoronaVirusUpdates: #COVID19 India Tracker
(As on 10 June, 2020, 08:00 AM)▶️ Confirmed cases: 276,583
▶️ Active cases: 133,632
▶️ Cured/Discharged/Migrated: 135,206
▶️ Deaths: 7,745#IndiaFightsCorona#StayHome #StaySafe @ICMRDELHIVia @MoHFW_INDIA pic.twitter.com/WC1M8bzDJ0
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 10, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu