దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో యూనివర్సిటీల పరీక్షలు మరియు అకాడమిక్ క్యాలెండర్లపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సవరించిన మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని అనుబంధ యూనివర్సిటీలు/విద్యాసంస్థలు పరీక్షల విషయంలో యూజీసీ మార్గదర్శకాలను అనుసరించాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) వెల్లడించింది. అలాగే 2020-21 విద్యా సంవత్సరానికి గానూ సవరించిన క్యాలెండరును ఏఐసీటీఈ ప్రకటించింది. సవరించిన అకాడమిక్ క్యాలెండరు ప్రకారం ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఏఐసీటీఈ సవరించిన అకడమిక్ క్యాలెండరు:
- కాలేజీలకు అనుమతి ఇవ్వడానికి ఆఖరు తేదీ – జూన్ 30, 2020
- కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వడం – ఆగస్టు 15, 2020
- ప్రవేశాల కోసం మొదటి రౌండ్ కౌన్సెలింగ్/సీట్ల కేటాయింపు – అక్టోబర్ 5, 2020
- ప్రవేశాల కోసం రెండో రౌండ్ కౌన్సెలింగ్/సీట్ల కేటాయింపు – అక్టోబర్ 15, 2020
- ఖాళీల అనుగుణంగా విద్యార్థులు చేరడానికి చివరి తేదీ – అక్టోబర్ 20, 2020
- పీజీడిఎం/పీజీసిఎం మినహా ఇతర సాంకేతిక కోర్సుల విద్యార్థులకు తరగతులు ప్రారంభం – ఆగస్టు 17, 2020
- కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు మరియు సెకండ్ ఇయర్ లో చేరే లాటరల్ ఎంట్రీ
- విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యే తేదీ – అక్టోబర్ 15, 2020
- ఇప్పటికే ఉన్న పీజీడిఎం/పీజీసిఎం విద్యార్థులకు తరగతులు ప్రారంభం – జూలై 15, 2020
- కొత్తగా ప్రవేశం పొందిన పీజీడిఎం/పీజీసిఎం విద్యార్థుల అకాడమిక్ సెషన్ – ఆగస్టు 10, 2020
- ఓపెన్ మరియు డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులలో విద్యార్థుల ప్రవేశాలకు చివరి తేదీ – ఆగస్టు 30, 2020 మరియు ఫిబ్రవరి 28, 2021
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu