మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 10, సోమవారం కూడా 37236 కరోనా కేసులు, 549 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 51,38,973 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 76,398 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 61,607 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 44,69,425 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 86.97 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.49 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 5,90,818 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 2,96,31,127 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ