సోమవారం క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు జరుగనున్న నేపథ్యంలో దీనికి ముందుగా శనివారం ఇంగ్లండ్లో రిహార్సల్స్ జరిగాయి. త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది విండ్సర్లో నిర్వహించిన ఈ రిహార్సల్లో చురుకుగా పాల్గొన్నారు. రాణి శవపేటికను అంతిమ సంస్కారాలు నిర్వహించే ప్రదేశానికి చేర్చడం, ఈ సమయంలో డ్రమ్స్, బ్యాండ్ వాయించటం వంటివి కొన్ని గంటలపాటు ప్రాక్టీస్ చేశారు. కాగా వెస్ట్మిన్స్టర్ అబ్బేలో రాణి అంత్యక్రియలు జరుగనున్నాయి. క్వీన్ ఎలిజబెత్-2 పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్-3 ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. అలాగే అతని ముగ్గురు తోబుట్టువులు ప్రిన్సెస్ అన్నే, ప్రిన్స్ ఆండ్రూ మరియు ఎడ్వర్డ్ అలాగే ఆయన కుమారులు ప్రిన్స్ విలియం మరియు ప్రిన్స్ హ్యారీ పాల్గొననున్నారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి యుఎస్ మరియు భారతదేశం వంటి సుదూర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున సందర్శకులు సెంట్రల్ లండన్కు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బ్రిటన్ రాణి అంత్యక్రియలకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె శనివారం సాయంత్రం లండన్కు బయల్దేరారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. భారతదేశం తరపున రాష్ట్రపతి ముర్ము, దివంగత రాణి మృతికి సంతాపం తెలియజేయనున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల అధిపతులు, వీఐపీలు రాణి అంత్యక్రియలకు హాజరవనున్నారు. కాగా రాణి అంత్యక్రియల కోసం సుమారు 9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.71 కోట్లు) వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY