భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 2, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 37,336 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,293 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 71 మంది మరణించారు. ఒక్కరోజులో ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1218 కి చేరుకుంది. కరోనా బాధితుల్లో 9,951 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 26,167 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
దేశంలో 1000 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర – 11,505
- గుజరాత్ – 4,721
- ఢిల్లీ – 3,738
- మధ్యప్రదేశ్ – 2,715
- రాజస్థాన్ – 2,678
- తమిళనాడు – 2,526
- ఉత్తర ప్రదేశ్ – 2,328
- ఆంధ్రప్రదేశ్ – 1,525
- తెలంగాణ – 1,044
500 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- పశ్చిమ బెంగాల్ – 795
- కర్ణాటక – 589
- పంజాబ్ – 585
100 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- కేరళ – 498
- బీహార్ – 466
- హర్యానా – 357
- ఒడిశా – 154
- జార్ఖండ్ – 113
100 లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- ఉత్తరాఖండ్ – 35
- అస్సాం – 29
- ఛత్తీస్ ఘడ్ – 18
- హిమాచల్ ప్రదేశ్ – 28
- మేఘాలయ –
- మిజోరం – 1
కేంద్రపాలిత ప్రాంతాలు:
- జమ్మూ కశ్మీర్ – 637
- అండమాన్ నికోబార్ – 33
- చండీఘర్ – 43
- లడఖ్ – 22
- పుదుచ్చేరి – 8
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu