దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ ఘన విజయం

Assembly Bye-elections Results: BJP Wins Four of Seven Assembly Seats Loses in Munugode Mokama, Assembly Bye-elections Results, BJP Wins Four of Seven Assembly Seats, BJP Loses in Munugode, BJP Loses in Mokama, Mango News,Mango News Telugu, ECI Released Bye-election Schedule for 5 Assembly, 1 Parliamentary Constituency in UP, Odisha Bye-election , Rajasthan Bye-election, Bihar Bye-election, Chhattisgarh Bye-election, UP, Odisha, Rajasthan, Bihar, Chhattisgarh, EC Released Notification, EC By-Election Notification, Election Comission Of India, Election Comission Latest News And Updates

దేశంలోని ఆరు రాష్ట్రాలలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 3వ తేదీన ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణలోని మునుగోడుతో పాటుగా మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, బీహార్ లోని మొఖమా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదమ్ పూర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రాంనాథ్, ఒడిశాలోని ధామ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నిక పోలింగ్ జరగగా, నవంబర్ 6, ఆదివారం నాడు కౌంటింగ్ పక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిలో బీజేపీ ఘన విజయం సాధించింది. మిగతా మూడింటిని టీఆర్ఎస్, ఆర్జేడీ, ఉద్ధవ్ థాకరే శివసేన వర్గం గెలుచుకున్నాయి.

దేశంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల ఫలితాలు:

  • బీహార్ లోని గోపాల్ గంజ్ అసెంబ్లీ నియోజవర్గం: రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై బీజేపీ అభ్యర్థి కుసుమ్ దేవి 1794 ఓట్ల మెజారిటీతో విజయం
  • హర్యానాలోని ఆదమ్ పూర్: కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాష్ పై బీజేపీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ 15740 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం
  • ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రాంనాథ్: సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్ గిరి 34298 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం
  • ఒడిశాలోని ధామ్‌నగర్: బిజూ జనతాదళ్ అభ్యర్థి అబంతి దాస్ పై బీజేపీ అభ్యర్థి సూర్యబంషి సూరజ్ 9881 ఓట్ల మెజారిటీతో గెలుపు
  • తెలంగాణలోని మునుగోడు: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10309 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం
  • బీహార్ లోని మొఖమా: బీజేపీ అభ్యర్థి సోనమ్ దేవిపై రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి నీలం దేవి 16741 ఓట్ల మెజారిటీతో విజయం
  • మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్‌: ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేష్ త్రిపాఠిపై శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అభ్యర్థి రుతుజా రమేష్ లట్కే 64959 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. అయితే ఈ స్థానంలో నోటా కు రెండో అత్యధిక ఓట్లు (12806) రావడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 13 =