తెలంగాణలో నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’, సాయంత్రం భారీ బహిరంగ సభ

Rahul Gandhi To Address Public Meeting Today Evening During Bharat Jodo Yatra Last Day in Telangana,rahul gandhi bharat jodo yatra, congress bharat jodo yatra,bharat jodo yatra, mango news,mango news telugu, priyanka gandhi, rahul gandhi, Rahul Gandhi Addresses Corner Meeting, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Latest News And Updates, Rahul Gandhi Launches Congress Bharat Jodo Yatra, Rahul Gandhi Meeting in Necklace Road, Rajiv Gandhi, Sonia Gandhi, Telangana Bharat Jodo Yatra

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ సోమవారం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ ఉదయం బిచ్కుంద మండలం పత్లా పూర్ వద్ద యాత్ర ప్రారంభమైంది. మరోవైపు నేటితో తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగియనుంది. రాష్ట్రంలో యాత్రకు నేడు చివరి రోజు కావడంతో పలువురు టీకాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటలకు మేనూరు గ్రామం వద్ద టీకాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అనంతరం మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించనుంది. తెలంగాణ సరిహద్దుల్లో రాహుల్ యాత్ర బాధ్యతలను మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేపట్టనున్నారు. ఇక తెలంగాణలో జరిగే చివరి సభ కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక కాంగ్రెస్ నేతలు భారీగా జనసమీకరణ జరుపుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =