భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రోజువారీగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూకే, యుఎఇ, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్ వంటి పలు దేశాలు భారత్ నుంచి విమానాల రాకపోకలపై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి ఆస్ట్రేలియా కూడా చేరింది. భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఒక ప్రకటన చేశారు. భారత్ నుంచి వచ్చే ప్యాసింజర్ విమాన సర్వీసులపై మే 15 వరకు నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా తీసుకున్న తాజా నిర్ణయంతో ఐపీఎల్ లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటుగా, ఆ దేశస్థులు కూడా కొన్నిరోజుల పాటుగా భారత్ లోనే ఉండిపోవాల్సి ఉంటుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ