హర్యానా రాష్ట్ర గవర్నర్ గా బండారు దత్తాత్రేయ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్లోని రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా బండారు దత్తాత్రేయ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ గవర్నర్ వి.పి.సింగ్ బద్నోర్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా హాజరై బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానా గవర్నర్ గా బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హర్యానా గవర్నర్ గా ఉన్న సత్యదేవ్ నారాయణ్ ఆర్యను త్రిపుర గవర్నర్ గా, హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను నియమించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ