కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పేరు ఖరారైంది. మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జి కిషన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బసవరాజ్ బొమ్మైకి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ కమ్యూనిటీకి చెందిన బసవరాజ్ బొమ్మై యడియూరప్ప కేబినెట్ లో హోమ్ మినిస్టర్ గా పనిచేశారు. రాష్ట్రంలోని హవేరి జిల్లా, షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గానికి బసవరాజ్ బొమ్మై ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఎమ్మెల్సీగా రెండు సార్లు, ఎమ్మెల్యేగా మూడు సార్లు ఆయన ఎంపికయ్యారు. కొత్త సీఎం రేసులో పలుపేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో యడియూరప్ప తర్వాత లింగాయత్ కమ్యూనిటీలో బలమైన నేతగా ఉన్న బసవరాజ్ బొమ్మై వైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తుంది. బసవరాజ్ బొమ్మై తండ్రి ఎస్.ఆర్.బొమ్మై కూడా గతంలో కర్ణాటక సీఎంగా పనిచేశారు. మరోవైపు కర్ణాటక రాష్ట్ర నూతన సీఎంగా బసవరాజ్ బొమ్మై బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ