దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 3,68,147 కరోనా కేసులు నమోదవడంతో మే 3, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లకు (1,99,25,604) చేరువైంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 3417 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2,18,959 కు చేరుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
దేశంలో 34 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 81.77 శాతం:
ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, బీహార్ వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 34,13,642 (17.13%) దాటింది. కొత్తగా 3,00,732 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,62,93,003 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 81.77 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.10 శాతంగా ఉంది. ఇక మే 2, ఆదివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 29,16,47,037 కు చేరుకుంది. గత 24 గంటల్లో 15,04,698 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ