సౌథాంప్టన్ వేదికగా జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. అలాగే ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్ 14, 2021 మధ్య ఇంగ్లాండ్ తో భారత్ జట్టు 5 టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్ తో పాటుగా ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ కు బీసీసీఐ 24 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్ లో పాల్గొన్న ఆటగాళ్లే ఎక్కువగా అవకాశం దక్కించుకున్నారు. అయితే ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వి షా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లకు చోటు దక్కలేదు. ఇక కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా ఫిట్నెస్ సాధిస్తే ఇంగ్లాండ్ కు పర్యటనకు వెళతారని పేర్కొన్నారు.
భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్ (ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి), వృద్ధిమాన్ సాహా (ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి).
స్టాండ్బై ప్లేయర్స్: అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, అర్జున్ నాగ్వస్వల్లా.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ