మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా రోజువారీగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 7, శుక్రవారం కూడా 54022 కరోనా కేసులు, 898 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,96,758 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 74,413 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 37,386 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 42,65,326 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 85.36 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.49 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 6,54,788 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 2,89,30,580 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ