వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్లో మూడు వన్డేలు, ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో కోల్కతాలో మూడు టీ20లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో వన్డే సిరీస్, టీ20 సిరీస్ లో తలపడే భారత జట్లను ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు బీసీసీఐ బుధవారం నాడు ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్ లలో ఆడనున్నాడు.
అలాగే కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అయితే కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులోకి రానున్నాడని తెలిపారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీకి ఈ సిరీస్ నుంచి విశ్రాంతి నిచ్చారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా కోలుకునే దశలో ఉన్నాడని, దీంతో వన్డేలు, టీ20లకు అందుబాటులో ఉండడన్నారు. ఇక అక్షర్ పటేల్ టీ20లకు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది.
వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, చాహల్, కుల్దీప్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్
టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, చాహల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ