కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 లో మిగిలిన మ్యాచులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో నిర్వహించాలని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2021 ఇప్పటికే 29 మ్యాచులు పూర్తికాగా, యూఏఈలో జరగబోయే మిగిలిన 31 మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ఆదివారం నాడు విడుదల చేసింది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు మొత్తం 27 రోజుల్లో దుబాయ్, షార్జా, అబుదాబి వంటి వేదికల్లో 31 ఐపీఎల్ మ్యాచులను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19 న దుబాయ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ తో మళ్ళీ ఐపీఎల్-2021 ఫేజ్-2 ప్రారంభమవనుంది. కాగా అక్టోబరు 10న క్వాలిఫయర్-1, అక్టోబరు 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న క్వాలిఫయర్-2, అక్టోబరు 15న ఫైనల్ మ్యాచులు నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం ఐపీఎల్ మ్యాచులు రాత్రి 7.30 గంటలకు, మరియు మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనున్నాయి.
🗓️ The dates are OUT!
Get ready for the #VIVOIPL extravaganza in the UAE 🇦🇪
FULL SCHEDULE 👇 pic.twitter.com/8yUov0CURb
— IndianPremierLeague (@IPL) July 25, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ