భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం నాడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆయనను కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తుంది. సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
ముందుగా జనవరి 2న ఛాతీనొప్పితో బాధపడుతూ సౌరవ్ గంగూలీ కోల్కతాలోని ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. గుండెలోని రక్తనాళాలు రెండు చోట్ల మూసుకుపోవడంతో వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. 6 రోజుల పాటు చికిత్స అనంతరం వైద్యపరంగా గంగూలీ ఆరోగ్యంగా ఉన్నట్లు ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రి ప్రకటించింది. దీంతో జనవరి 7 న గంగూలీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మరోసారి అస్వస్థతకు గురవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకుంది. సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ