వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26, గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ర్యాలీ సందర్భంగా కొందరు నిరసనకారులు ఎర్రకోట యొక్క ప్రాకారాలపైకి ఎక్కి నిశాన్ సాహిబ్ జెండాలను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బుధవారం నాడు ఎర్రకోటను సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరించారు. ముందుగా ఎర్రకోట వద్ద జరిగిన ఘటనను మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఖండించారు. ఎర్రకోట మన ప్రజాస్వామ్యానికి చిహ్నమని, ఎర్రకోట గౌరవాన్ని తగ్గించేలా వ్యవహారించడం విచారకరం మరియు దురదృష్టకరమని పేర్కొన్నారు. మరోవైపు నిరసనకారుల దాడిలో ఎర్రకోట ప్రాంగణంలో టికెట్ కౌంటర్, మెటల్ డిటెక్టర్ గేట్ సహా కొన్ని ధ్వంసం అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ