బెంగళూరులో ప్రముఖ రైతు నాయకుడు రాకేష్ టికాయిత్పై కొందరు దాడి చేశారు. బిజెపి పాలిత కర్ణాటక రాజధాని నగరంలో రైతు సంఘం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనటం కోసం సోమవారం భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయిత్ బెంగళూరు వచ్చారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆయనపై కొందరు నల్ల ఇంకు చల్లటం కలకలం సృష్టించింది. ఈ సమయంలో చుట్టుపక్కల ప్రజలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో గందరగోళం చెలరేగింది. ఈ కార్యక్రమంలో మరికొందరు రైతు నాయకులు కూడా పాల్గొన్నారు.
ఈ ఘటన తర్వాత సదరు వ్యక్తిని టికాయిత్ మద్దతుదారులు పట్టుకొని చితక బాదారు. పోలీసులు సదరు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక రైతు నాయకుడు చంద్రశేఖర్ మద్దతుదారులుగా వారిని గుర్తించారు. విలేకరుల సమావేశంలో రాకేశ్ టికాయిత్ను రైతు నేత చంద్రశేఖర్ గురించి ప్రశ్నించగా.. ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన సమయంలో వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కాగా దీనిపై రాకేశ్ టికాయిత్ స్పందిస్తూ.. తనకు పోలీసులు ఎలాంటి భద్రత ఇవ్వలేదని, ప్రభుత్వ అండతోనే తనపై దాడి జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై స్పందించిన ఆర్ఎల్డి చీఫ్ జయంత్ చౌదరి.. బెంగళూరులో బీకేయూ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయిత్తో అసభ్యంగా ప్రవర్తించడం సిగ్గుచేటని, కర్నాటక ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఒక ప్రకటనలో కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF