ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 47వ రైజింగ్ డే/వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా కోస్ట్ గార్డ్ సిబ్బంది అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. “కోస్ట్ గార్డ్ సిబ్బంది అందరికీ వారి రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఇండియన్ కోస్ట్ గార్డ్ వృత్తి నైపుణ్యానికి మరియు మన తీరప్రాంతాలను సురక్షితంగా ఉంచడానికి చేస్తున్న కృషికి ప్రసిద్ధి చెందింది. వారి భవిష్యత్ ప్రయత్నాలకు వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అలాగే కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, “ఇండియా కోస్ట్ గార్డ్ సిబ్బందికి వారి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. భారతదేశం యొక్క మారిటైమ్ (సముద్రాన్ని) రక్షించడానికి తమను తాము రక్షణ రేఖగా అందించడం ద్వారా వారు దేశ సేవకు తమ నిబద్ధతతో స్ఫూర్తిని పొందుతారు. వారి అజేయమైన దేశభక్తికి నమస్కరిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE