ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కరోనా వ్యాక్సిన్ తయారీ పురోగతిని పరిశీలించేందుకు శనివారం నాడు మూడు నగరాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్ కి చేరుకున్న ప్రధాని మోదీకి సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మొహంతి, సైబరాబాద్ సీపీ సజ్జనార్, హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్, స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా శామీర్పేట సమీపంలోని జినోమ్ వ్యాలీలో గత భారత్ బయోటెక్ సంస్థ వద్దకు ప్రధాని మోదీ బయలుదేరారు.
భారత్ బయోటెక్ “కొవాగ్జిన్” పేరుతో తయారు చేస్తున్న కరోనాకు వ్యాక్సిన్ తయారీ, పురోగతిని ప్రధాని మోదీ పరిశీలించనున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నగరంలో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ రోజు ఉదయం గుజరాత్లోని అహ్మదాబాద్ లో గల జైడస్ బయోటెక్ పార్క్ కు కూడా ప్రధాని సందర్శించారు. జైడస్ క్యాడిలా సంస్థ “జైకోవ్-డి” పేరుతో అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను, పురోగతిని ప్రధాని మోదీ పరిశీలించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ