బీజేపీ యువనేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఆయన తల్లి మాధవి రాజే సింధియాకు కూడా కరోనా పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తుంది. వారిద్దరూ జ్వరం, గొంతునొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురి కాగా పరీక్షలు చేయడంతో కరోనా సోకినట్లు వైద్యులు నిర్దారించారు. ప్రస్తుతం వారిద్దరూ సౌత్ ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతూ అస్వస్థతకు గురవడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన సాంపిల్స్ సేకరించి కరోనా నిర్దారణ పరీక్షలకు పంపించారు. కాగా రిపోర్ట్లో ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చినట్లు తేలిందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu