బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. “కరోనా యొక్క ప్రారంభ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాను. ఫలితం పాజిటివ్ గా వచ్చింది. వైద్యుల సలహా మేరకు అన్ని మార్గదర్శకాలను అనుసరిస్తూ హోమ్ ఐసొలేషన్ లో ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. గత కొద్ది రోజులుగా ఎవరైతే నన్ను సంప్రదించారో, దయచేసి వారు ఇతరులతో వేరుగా ఉండి కరోనా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని జేపీ నడ్డా ట్వీట్ చేశారు. దీంతో జేపీ నడ్డా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ట్వీట్స్ చేశారు.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है, डॉक्टर्स की सलाह पर होम आइसोलेशन में सभी दिशा- निर्देशो का पालन कर रहा हूँ। मेरा अनुरोध है, जो भी लोग गत कुछ दिनों में संपर्क में आयें हैं, कृपया स्वयं को आइसोलेट कर अपनी जाँच करवाएं।
— Jagat Prakash Nadda (@JPNadda) December 13, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ