ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు దేశాల అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారో కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆదివారం నుంచి జ్వరం, కండరాల నొప్పులతో అస్వస్థతగా ఉండడంతో సోమవారం నాడు ఊపిరితిత్తుల ఎక్స్రే పాటు కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నట్టు తెలిపారు.
కరోనా చికిత్సలో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడుతున్నానని, కరోనా నుండి త్వరగానే కోలుకుంటానని బోల్సోనారో మీడియాకు వెల్లడించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందిస్తూ ” నా స్నేహితుడు, బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ బోల్సోనారో త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు” పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో అమెరికా తర్వాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu