సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈ రోజు (జూలై 22, శుక్రవారం) ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది 12వ తరగతికి 14,44,341 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 14,35,366 మంది పరీక్షలకు హాజరుకాగా, 13,30,662 మంది అనగా 92.71 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. బాలికలు 94.54 శాతం, బాలురు 91.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. 33 వేల మందికిపైగా విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించగా, లక్షా 34 వేల మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు సాధించినట్టు తెలిపారు.
ఇక ఫలితాలను cbseresults.nic.in, results.cbse.nic.in వంటి అధికారిక వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉంచారు. అలాగే cbse.digilocker.gov.in లో కూడా విద్యార్థులు వారి స్కోర్ లను చూసుకోవచ్చని చెప్పారు. మరోవైపు ఈ సీబీఎస్ఈ 12 తరగతి పరీక్షలను రెండు టర్మ్స్/విడతలుగా జరిగిన విషయం తెలిసిందే. 2021 నవంబర్- డిసెంబర్లో మొదటి టర్మ్, 2022 మే-జూన్లో రెండో టర్మ్ పరీక్షలు జరిగాయి. కాగా రెండు టర్మ్స్ వెయిటేజీ ఆధారంగా తుది ఫలితాలను వెల్లడించారు. అయితే థియరీకి సంబంధించి రెండింటిల్లో 50:50 వెయిటేజీకి ప్రకటిస్తారని అంతా భావించగా, టర్మ్-1 30 శాతం, టర్మ్-2 కు 70 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ఫలితాలను ప్రకటించారు. కాగా ప్రాక్టికల్ పేపర్ల కోసం 50-50 వెయిటేజీ ఫార్ములా అనుసరించారు. ఇక సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో త్రివేండ్రం రీజియన్ 98.83 శాతంతో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం నమోదు చేయగా, ప్రయాగ్రాజ్ 83.71 శాతంతో చివరన నిలిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY