సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం నాడు 10వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 21 లక్షలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు నమోదు చేసుకోగా, మొత్తం 99.04 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. మొత్తం 21,13,767 మంది విద్యార్థులకు గానూ 20,97,128 మంది ఫలితాలను ఈ రోజు విడుదలయ్యాయి. మరో 16,639 మంది విద్యార్థుల ఫలితాలు ఇంకా సిద్ధమవుతున్నాయని, వారి ఫలితాల విడుదల తేదీలు తరువాత ప్రకటించబడతాయని పేర్కొన్నారు. బాలికలు 99.24 శాతం, బాలురు 98.89 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఫలితాలను cbseresults.nic.in, cbse.gov.in వెబ్ సైట్లలో లేదా digilocker.gov.in లో కూడా విద్యార్థులు చూసుకోవచ్చని తెలిపారు. ఈ వెబ్ సైట్స్ లో విద్యార్థులు ఫలితాల కోసం రోల్ నెంబర్ తో పాటుగా ఇతర అవసరమైన వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ముందుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు రద్దు కావడంతో ప్రీ-బోర్డ్ పరీక్షలు, అర్ధ సంవత్సరం, ఇంటర్నల్ అస్సేస్మెంట్ ఆధారంగా సీబీఎస్ఈ బోర్డు ఈ పరీక్షల ఫలితాలను వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ