కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా నియంత్రణ చర్యలు, ఆర్ధిక వ్యవస్థపై ప్రభావంతో పాటుగా పలు ఇతర అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏప్రిల్ 22, బుధవారం నాడు కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ కేబినెట్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:
- దేశంలో కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా పరిగణిస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం.
- 1987 అంటురోగాల చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. రాష్ట్రపతి ఆమోదం అనంతరం అమల్లోకి రానున్న ఆర్డినెన్స్.
- వైద్య సిబ్బందిపై దాడి చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు.
- వైద్యులపై దాడి చేసిన వారిపై ఆ కేసు తీవ్రతను బట్టి 6 నెలల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే రూ.లక్ష నుంచి 5 లక్షల వరకు జరిమానా.
- దాడుల సమయంలో వైద్య సిబ్బంది వాహనాలు లేదా ఆసుపత్రి/క్లినిక్ కు ఏదైనా ఆస్తి నష్టం సంభవిస్తే మార్కెట్ విలువ ప్రకారం లెక్కించి దాడికి పాల్పడిన వారి నుంచి అంతకు రెట్టింపు వసూలు చేయాలనీ నిర్ణయం.
- కరోనా చికిత్స నిమిత్తం విధుల్లో ఉన్న అన్ని రకాల సిబ్బందికి (వైద్యులు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య) రూ.50 లక్షల వరకు వైద్య బీమా సదుపాయం.
- కరోనా నియంత్రణ చర్యల కోసం రూ.15వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు.
- కరోనా బాధితులకు ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స.
- విమాన, ఇతర ప్రయాణ సేవలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu