కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 20 తర్వాత నాన్ హాట్స్పాట్ ప్రాంతాల్లో కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చారు. అయినా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా లాక్డౌన్ అమలులో తాజాగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులను ప్రకటించింది. అయితే హాట్ స్పాట్, కంటైన్మెంట్ జోన్స్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని పేర్కొన్నారు. ఈ సడలింపుల వివరాలను కేంద్ర హోంశాఖ, కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సహా వివిధ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు.
కేంద్రం కొత్తగా ప్రకటించిన సడలింపుల వివరాలు:
- పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రికల్ దుకాణాలు
- స్టేషనరీ, పుస్తకాల దుకాణాలు
- సీనియర్ సిటిజన్స్ యొక్క ఇన్-హౌస్ కేర్ టేకర్స్
- నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్ షాపులు
- మొబైల్ రీఛార్జి దుకాణాలు
- మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు
- రహదారి నిర్మాణ పనులకు అనుమతి
- సిమెంట్ యూనిట్లు, విక్రయాలకు అనుమతి
- రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత
- ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu