లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వలస కూలీలు, యాత్రికులు, సందర్శకులు, విద్యార్థులు మరియు ఇతరులు, రైల్వే మంత్రిత్వ శాఖ నడిపే ప్రత్యేక రైళ్ల ద్వారా వారి సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. అయితే వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నప్పటికీ అక్కడి నుంచి వారి సొంత గ్రామాలకు వెళ్లే మార్గం లేక, కాలినడకన వెళ్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలస కార్మికుల అవస్థలు వార్తల్లో నిలవడంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రైళ్ల ద్వారా రాష్ట్రాలకు చేరుకున్న కార్మికులను వారి గ్రామాలకు చేర్చేందుకు ఆయా రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండే ఏర్పాట్లు చేయడం, శానిటైజర్స్ వాడడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu