దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్లను అందజేయనున్నట్టు కేంద్రం ఇటీవలే ప్రకటించింది. దేశంలో నెలవారీగా ఉత్పత్తి అయ్యే కరోనా వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయనుండగా, 25% ప్రైవేటుకు ఇచ్చేలా నిర్ణయించారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు సర్వీస్ ఛార్జీ కింద ఒక్కో డోసుకు గరిష్టంగా రూ.150 వరకు వసూలు చేయవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ ధరలను మంగళవారం నాడు కేంద్రం నిర్ణయించింది. నేషనల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వీ వంటి మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా వ్యాక్సిన్ల ఒక్కో డోసు ధరలు:
- కొవిషీల్డ్ వ్యాక్సిన్ : 600 (సంస్థ నిర్ణయించిన ధర) + 30 (జీఎస్టీ 5%) + 150 (గరిష్ట సర్వీస్ చార్జీ) = రూ.780
- కొవాగ్జిన్ వ్యాక్సిన్ : 1200 (సంస్థ నిర్ణయించిన ధర) + 60 (జీఎస్టీ 5%) + 150 (గరిష్ట సర్వీస్ చార్జీ) = రూ.1410
- స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ : 948 (సంస్థ నిర్ణయించిన ధర) + 47.40 ~ 47 (జీఎస్టీ 5%) + 150 (గరిష్ట సర్వీస్ చార్జీ) = రూ.1145
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ