చైనా దేశంలో కోవిడ్-2019( కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ వైరస్ వలన ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఒక్కరోజే హుబెయ్ ప్రావిన్సులో 242 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందడం మొదలయ్యాక ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు నమోదవ్వడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. దీంతో కోవిడ్-2019 కారణంగా ఇంతవరకు మరణించిన వారి సంఖ్య 1,355కు చేరుకుంది.
మరోవైపు ఈ వైరస్ కొత్తగా సుమారు 15,000 మందికి సోకిందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనాలో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 60 వేలు దాటింది.కోవిడ్-2019 వైరస్ ను గుర్తించేందుకు అవలంభింస్తున్న విధానాన్ని మార్చడం వలనే అటూ మృతుల సంఖ్య, ఇటూ కొత్తగా వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా పెరిగిందని హుబెయ్ ప్రావిన్సు అధికారులు తెలిపారు. అలాగే అమెరికాలోని కాలిఫోర్నియాలో గురువారం నాడు మరో కొత్త కోవిడ్-2019 కేసు నమోదైంది. దీంతో అమెరికాలో వైరస్ సోకిన వారి సంఖ్య 13కు చేరుకుంది.
[subscribe]