ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ ఆదివారం నాడు అస్వస్థత గురవడంతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆరా తీసారు. ములాయం సింగ్ కుమారుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. ములాయం యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దసరా తర్వాత తాను స్వయంగా వచ్చి కలుస్తానని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ కు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY