కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో ఆరోరోజు భారత్ ఖాతాలోకి 5 మెడల్స్, 18కి చేరిన మెడల్స్ సంఖ్య

Commonwealth Games-2022 India Gets Five Medals on 6th Day Total Medals Reach to 18, India Gets Five Medals on 6th Day In Commonwealth Games-2022, Total Medals Reach to 18 In Commonwealth Games-2022, CWG 2022, 5 gold Medals In Commonwealth Games-2022, 6 silver And 7 bronze Medals In Commonwealth Games-2022, Commonwealth Games-2022, Birmingham Commonwealth Games 2022, 2022 Birmingham Commonwealth Games, Birmingham Commonwealth Games, Commonwealth Games, Birmingham Alexander Stadium, Commonwealth Games 2022 sports, Birmingham Commonwealth Games 2022 News, Birmingham Commonwealth Games 2022 Latest News, Birmingham Commonwealth Games 2022 Latest Updates, Birmingham Commonwealth Games 2022 Live Updates, Mango News, Mango News Telugu,

కామన్‌ వెల్త్ గేమ్స్‌-2022 లో భారత్ అథ్లెట్ల అత్యుత్తమ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ క్రమంలో ఆరో రోజైన ఆగస్టు 3, బుధవారం నాడు భారత్ ఖాతాలో మరో 5 (ఒక రజతం, నాలుగు కాంస్యం) పతకాలు చేరాయి. జూడోలో తూలిక మాన్‌ రజతం సాధించగా, వెయిట్‌ లిప్టింగ్ లో లవ్‌ప్రీత్ సింగ్, గుర్‌దీప్‌ సింగ్‌, స్కాష్ లో సౌరభ్‌ ఘోషల్‌, హైజంప్ లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్యం పతకాలను గెలుచుకున్నారు. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 5 స్వర్ణ, 6 రజత, 7 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 18 మెడల్స్ చేరాయి.

జూడో మహిళల +78 కేజీల విభాగం ఫైనల్లో ఎంతో పోరాడిన తులికా మాన్, స్కాట్‌లాండ్‌కు చెందిన సారా అడ్లింగ్‌టన్‌ చేతిలో ఓడింది. మొదటిసారిగా ఈ గేమ్స్ లో బరిలో దిగిన తూలిక మాన్ మంచి ప్రదర్శనతో ఫైనల్ కు చేరి రజతం సాధించింది. దీంతో ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు జూడోలో భారత్‌ ఖాతాలో 3వ పతకం చేరింది. వెయిట్‌ లిప్టింగ్ పురుషుల 109 కేజీల విభాగంలో భారత్ వెయిట్ లిఫ్టర్‌ లవ్‌ప్రీత్ సింగ్ 355 కేజీలు (స్నాచ్‌లో 163 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 192 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలవడంతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే పురుషుల 109+కేజీల విభాగంలో భారత్ వెయిట్‌లిఫ్టర్‌ గుర్‌దీప్‌ సింగ్‌ 390 కేజీలు (స్నాచ్‌లో 167 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 223 కేజీలు) ఎత్తి మూడో స్థానంలో నిలవడంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో వెయిట్‌ లిఫ్టింగ్ లో భారత్ పతకాల సంఖ్య పదికి చేరింది.

ఇక స్క్వాష్‌ లో సీనియర్ ఆటగాడు సౌరభ్‌ ఘోషల్‌ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ కు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ జేమ్స్ విల్‌స్ట్రాప్‌ను 3-0తో ఓడించి సౌరవ్ ఘోషల్‌ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో స్క్వాష్‌ సింగిల్స్‌లో సౌరవ్‌కి ఇది తొలి పతకం. 35 ఏళ్ల సౌరవ్ 2018లో ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌ లో జరిగిన కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపిక పల్లికల్‌ తో కలిసి రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు అథ్లెటిక్స్‌లో బుధవారం భారత్‌ కు తొలి పతకం అందింది. తేజస్విన్ శంకర్‌ హైజంప్ లో కాంస్యం గెలుచుకున్నాడు. కామన్‌ వెల్త్ గేమ్స్‌ లో హైజంప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. తేజస్విన్ శంకర్‌ వరుస ప్రయత్నాల్లో 2.10, 2.15, 2.19, 2.22 మీటర్ల ఎత్తును విజయవంతంగా దూకాడు. బెస్ట్ ప్రయత్నం 2.22మీ తో మూడో స్థానంలో నిలవడంతో అతనికి కాంస్యం ఖాయమైంది. ఆరో రోజు పతకాలు సాధించిన విజేతలు అందరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =