కామన్ వెల్త్ గేమ్స్-2022 అథ్లెటిక్స్ లో భారత్ ఖాతాలోకి మరో పతకం చేరింది. శనివారం జరిగిన మహిళల 10,000 మీటర్ల(10 కి.మీ) రేస్ వాక్ లో భారత్ అథ్లెట్ ప్రియాంక గోస్వామి రజత పతాకాన్నిగెలుచుకుంది. ప్రియాంక మారథాన్ దూరాన్ని 43:38.82 సమయంలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకుంది. దీంతో రేస్ వాకింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా ప్రియాంక నిలిచింది. కాగా కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కిది రెండో రేస్ వాకింగ్ పతకం. 2018 గేమ్స్ లో 20 మీటర్ల రేస్ వాక్లో హర్మీందర్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన జెమిమా మోంటాగ్ 42:38 సమయంతో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకుంది. ఇక ఈ పోటీలో ఉన్న మరో భారత్ అథ్లెట్ భావా జాట్ 8వ స్థానంలో నిలిచింది. అథ్లెటిక్స్ లో ఇప్పటికే లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజతం మరియు హైజంపర్ తేజస్విన్ శంకర్ కాంస్యం గెలుచుకున్నారు. ప్రియాంక గోస్వామి రజతంతో భారత్ పతకాల సంఖ్య 27కు చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY