దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండోరోజూ కూడా 21వేలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,880 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,38,47,065 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 60 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,25,930 కి పెరిగింది. దీంతో దేశంలో ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కరోనా కేసుల సంఖ్య లక్ష 49 వేలు (1,49,482 (0.34%)) దాటింది. అలాగే కొత్తగా 21,219 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,31,71,653 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.46 శాతంగానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (2662), పశ్చిమబెంగాల్ (2486), మహారాష్ట్ర (2289), తమిళనాడు (2093), కర్ణాటక (1552), ఒడిశా (1196), గుజరాత్ (816), తెలంగాణ (765), అస్సాం (720), ఛత్తీస్ ఘడ్ (700) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద జూలై 22, శుక్రవారం ఉదయం 7 గంటల వరకు 201.30 కోట్లకుపైగా (2,01,30,97,819 వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 37,06,997 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY