పార్టీ లోక్‌సభ ఎంపీలతో సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్, కరోనా పరిస్థితులపై చర్చ

congress party, Congress Party Meeting, Congress President Sonia Gandhi, Congress President Sonia Gandhi Video Conference, national news, Sonia Gandhi, Sonia Gandhi Latest News, Sonia Gandhi Video Conference, Sonia Gandhi Video Conference with Party Lok Sabha MPs

కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ జూలై 11, శనివారం నాడు పార్టీ లోక్‌సభ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, రాజకీయ పరిణామాలు, తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. అలాగే ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కీలకంగా చర్చినట్టు తెలుస్తుంది. కరోనా మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, భారత్- చైనా సరిహద్దు వివాదంలో ప్రభుత్వం తీరును ప్రశ్నించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టుగా సమాచారం. మరోవైపు కరోనా పరిస్థితుల్లో కేంద్రం పేదలకు ఆర్థిక సహాయం అందించలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. పేద, బలహీన వర్గాల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేసి వారికీ ఉపశమనం కలిగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 19 =