దేశంలో జరుగుతున్న పలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలని పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకంపై కూడా నాయకుల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం నాడు సీనియర్ నాయకులతో సమావేశం అయ్యారు. ఢిల్లీలోని 10 జనపథ్ లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, అంబికా సోని, పి.చిదంబరం, అశోక్ గెహ్లోట్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, బిఎస్ హుడా హాజరైనట్లు తెలుస్తుంది. మరోవైపు పార్టీలో నాయకత్వ, సంస్థాగత సమస్యలపై “గ్రూప్ 23” గా పిలువబడే 23 మంది నాయకులు గతంలో ఓ లేఖతో గళమెత్తిన సంగతి తెలిసిందే. లేఖ రాసిన పలువురు అసమ్మతి నేతలు కూడా ఈ భేటీకి హాజరు కావడంతో పాధాన్యత సంతరించుకుంటోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ