దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో మొత్తం 4,00,110 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 20,551 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 5.14 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,41,07,588 కు చేరుకుంది. అలాగే కొత్తగా మరో 70 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,600 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 21,595 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,34,45,624 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.50 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 1,35,364 (0.31%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఆగస్టు 4 (8am)–ఆగస్టు 5 (8am)):
- ఢిల్లీ – 2202
- కర్ణాటక – 1992
- మహారాష్ట్ర – 1862
- ఒడిశా – 1790
- కేరళ – 1364
- తమిళనాడు – 1211
- తెలంగాణ – 1061
- హర్యానా – 900
- ఉత్తర్ ప్రదేశ్ – 881
- గుజరాత్ – 871
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY